C. M రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ
Published: Saturday June 19, 2021
మధిర, జూన్ 18, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండల జలిముడి గ్రామంలో బొగ్గుల భరత్ కుమార్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ సీఎం సహాయ నిధి నుండి ఆర్దిక సహాయం అందించాలని కోరుతూ. మధిర శ్యాసన సభ్యులు మల్లుభట్టి విక్రమార్క ద్వారా దరఖాస్తు చేసుకోగా మల్లుభట్టి విక్రమార్క గారి సిఫార్సు మేరకు సీఎం సహాయ నిధి నుండి చెక్కు మంజూరు అయింది. కాగా అట్టి చెక్కును ఈరోజు మధిర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూరం శెట్టి కిశోర్ చేతుల మీదుగా అందించటం జరిగింది, బొగ్గుల భరత్ కుమార్ రెడ్డి. s/oబొగ్గుల కృష్ణ రెడ్డి, జాలిముడి గ్రామం.19,500 rs చెక్ వారికిఅందించటం జరిగింది.. ఈ కార్యక్రమంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్, సర్పంచ్ పులిబండ్ల చిట్టి బాబు, తడికమళ్ళ ప్రభాకర్ మొదలగు వారు పాల్గొన్నారు.
Share this on your social network: