గులాబీ గూటికి చేరిన తరిగోపుల మాజీ సర్పంచ్ ఎం రవి కుమార్

Published: Tuesday January 25, 2022
వికారాబాద్ బ్యూరో 24 జనవరి ప్రజాపాలన : టిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆకర్షితులై పార్టీలో చేరుతున్న ప్రతిపక్ష నేతలు. ప్రజా సంక్షేమమే ప్రథమ లక్ష్యంగా సీఎం కేసీఆర్ దూరదృష్టితో అమలు చేస్తున్న ప్రతి పథకం ప్రజాకర్షణ చూరగొన్నది. వివిధ గ్రామాల రాజకీయ ప్రతిపక్షాల నేతల వలసలు ఎక్కువయ్యాయి. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఒక్కొక్క హామీని దశలవారీగా నెరవేరుస్తున్న తీరుకు నచ్చి గులాబీ దళంలో చేరికల పర్వం కొనసాగుతుంది. అందులో భాగంగానే ధారూర్ మండల పరిధిలోని తరిగోపుల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఎం.రవికుమార్ కు సోమవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ టిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ధారూర్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజు నాయక్, ఏఎంసి చైర్మన్ ముచ్చర్ల సంతోష్ కుమార్ గుప్తా ఏఎంసీ మాజీ చైర్మన్ రాములు ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ రాజు గుప్తా పిఎసిఎస్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి రైతుబంధు అధ్యక్షుడు రుద్రారం వెంకటయ్య ముదిరాజ్ టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కావలి ఆంజనేయులు ముదిరాజ్ ల ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరుటకు అవకాశాలు మెండుగా ఉంటున్నాయి.