పలు సమస్యలపై బండి సంజయ్ కి మండల బిజెపి నాయకులు వినతి పత్రం

Published: Tuesday May 17, 2022

బోనకల్, మే 16 ప్రజా పాలన ప్రతినిధి: బీజేపీ తెలగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అత్కూర్ గ్రామంలో బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ళపల్లి విజయరాజు కుమారుల పంచల వేడుకకు విచ్చేసి చిన్నారులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా జిల్లాల పునర్విభజన జరిగిన తరువాత అటెండర్ నుంచి ఆఫీసర్ స్థాయి వరకు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ విషయం పై సంబంధిత శాఖలో ఉద్యోగులు లేక పాలన కుంటుబడిందని, పదవి విరమణ పొందిన ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ సకాలంలో రావడంలేదని బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తరువాత పాత పెంక్షన్ విధానాన్ని కొనసాగించాలని 15 రోజులోనే అందవాల్సిన బెనిఫిట్స్ అందేలా చూడాలని మండల అధ్యక్షులు వీరపనేని అప్పారావు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి ఘన స్వాగతం పలికి, పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాఢ్యక్షుడు గుగులోతు నాగేశ్వరరావు, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు తాళ్లూరి సురేష్ , ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవి, జిల్లా కార్యవర్గ నాయకులు ఏనుగు సుమన్ బాబు తదితరులు పాల్గొన్నారు.