ఎల్ హెచ్ పీఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా సైదులునాయక్..
Published: Monday October 17, 2022
ఖమ్మం, అక్టోబర్ 16 (ప్రజాపాలన న్యూస్):
తెలంగాణ రాష్ట్ర లంబాడి హక్కుల పోరాటసమితి రాష్ట్ర అధ్యక్షులుగా ఖమ్మంజిల్లా కొనిజర్ల మండలంలోని ఉప్పలచెలక గ్రామానికి చెందిన బాధావత్ సైదులు నాయక్ నియామకం అయ్యారు. ఆదివారం ఖమ్మంలో ఆ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు భూక్యా సంజీవ నాయక్ చేతుల మీదుగా ఆయన నియామకపు ఉత్తర్వులను అందుకున్నారు. ఆయనతో పాటు రాష్ట్ర మహిళాసంఘం అధ్యక్షురాలిగా బానోతుపద్మా బాయి, ఖమ్మంజిల్లా ఇన్చార్జిగా ఇస్లావత్ మురళిని నియమించి నియామక పత్రాలు అందించారు.
ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ మాన్సింగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుగులోత్ మాతృ నాయక్, గుగులోత్ సంతులాల్, జిల్లా, మండలాల నాయకులు పాల్గొన్నారు.*
Share this on your social network: