కష్టకాలంలో ఉచిత బియ్యం : సర్పంచ్ రాజిరెడ్డి

Published: Monday June 07, 2021
పరిగి, జూన్ 06, ప్రజాపాలన ప్రతినిధి : కరోనాతో ఉపాధి కోల్పోతున్న పేదలకు ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణి హర్షించదగ్గ విషయం అని దోమ సర్పంచుల సంఘం అధ్యక్షులు కె రాజిరెడ్డి, రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్  లక్ష్మయ్య. జిల్లా గ్రంథాలయ శాఖ డైరెక్టర్ బంగ్లా యాదయ్య గౌడ్, ఉప సర్పంచ్ గోపాల్ గౌడ్ లు అన్నారు. ఆదివారం దోమ మండల కేంద్రంలో ఒక వ్యక్తికీ 15.కిలోల ఉచిత బియ్యం పంపిణి కార్యక్రమంలో భాగంగా పేదలకు రేషన్ షాప్ ద్వారా బియ్యం పంపిణీలో పాల్గొని గత సంవత్సరం కూడా ఉచిత బియ్యం 10.కిలోలు ఇవ్వగ ప్రస్తుతం మరో 5.కిలోలు అదనంగా ఇవ్వడం సంతోషించ దగ్గ విషయమని సర్పంచ్కె రాజిరెడ్డి అన్నారు. రేషన్ షాప్ ద్వారా పంపిణి జరిగే బియ్యం అందరికి సమయనుకూలంగా అందేలా చూడాలని రేషన్ డీలర్ గౌసియాకు సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు లక్ష్మణ్, తెరాస నాయకులు మైను, హరిబాబు, లబ్ధిదారులు పాల్గొన్నారు.