చౌటుప్పల్ మండలం లోని పలు గ్రామాల్లో సహపంక్తి భోజనాలు *పాల్గొన్న ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, శ

Published: Wednesday September 28, 2022

చౌటుప్పల్, సెప్టెంబర్ 27 (ప్రజాపాలన ప్రతినిధి): గత ప్రభుత్వాలు హయాల్లో దళితులు వివక్షతకు గురయ్యారు. కెసిఆర్ పాలనలో దళితులు ఆర్థిక పరిపుష్టి పొందుతున్నారని ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, శానంపూడి సైదిరెడ్డి లు అన్నారు. మండలంలోని ఎస్ లింగోటం, జై కేసారం, ఆరెగూడెం గ్రామాల్లో దళిత వాడల్లో దళిత సమ్మేళనం నిర్వహించారు. సహపంక్తి భోజనాలు చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ దళితుల ఆర్థిక అభివృద్ధికి ప్రవేశపెట్టిన దళిత బంధు దేశానికి ఆదర్శమని అన్నారు. తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ పార్టీకి ఓటు వేస్తే మోటర్లకు మీటర్లు తప్పవని హెచ్చరించారు. బిజెపి దళిత వ్యతిరేక పార్టీగా చరిత్రలో ఉందని అన్నారు. మునుగోడు లో జరగబోయే ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు ఆకుల సునీత శ్రీకాంత్, కొర్పురి సైదులు, మునగాల ప్రభాకర్ రెడ్డి, నాయకులు లింగస్వామి, శేఖర్, మల్లేశం, బాతరాజు యాదయ్య, చెన్నగోని అంజయ్య,బొడిగే ఆనంద్, ముత్తిరెడ్డి,భూపాల్ రెడ్డి,రాజు తదతరులు పాల్గొన్నారు.