నాలలో వ్యర్ధాలు వేయకుండా సహకరించండి

Published: Friday June 17, 2022
మేడిపల్లి, జూన్16 (ప్రజాపాలన ప్రతినిధి)  

 టీవీ స్టూడియో వద్దగల నాలలో వ్యర్ధాలు వేయకుండా సహకరించాలని

హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరిష్ దూరదర్శన్ 
డిప్యూటీ డైరెక్టర్ రామకృష్ణకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు కార్పొరేటర్ చేతన హరీష్ దూరదర్శన్ డిప్యూటీ డైరెక్టర్ రామకృష్ణతో కలిసి టీవీ స్టూడియో వద్దగల నాలా పూడిక తీత పనులు పరిశీలించారు. రానున్న వర్షాకాలాన్ని ద్రష్టిలో ఉంచుకోని నీట మునగకుండా నాలలో ఉన్న మట్టిని మొత్తం ఎత్తివేసి వర్షపు నీరు సాపిగా వెళ్లేందుకు నాలలో వ్యర్ధాలు వేయకుండా సహకరించాలని టీవీ స్టూడియో లోపల నివసిస్తున్న దూరదర్శన్ ఉద్యోగస్తులకు కాలనీవాసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ డైరెక్టర్ దూరదర్శన్ రామకృష్ణ దృష్టికి
 కార్పొరేటర్ తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్, ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ అధికారులు నాగమణి, మౌనిక మరియు బిజెపి నాయకులు సంజయ్ పటేల్ , న్యాలకొండ సుమన్ రావు పాల్గొన్నారు.