మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎవరికి దక్కును మధిర నవంబర్ 8 ప్రజా పాలన ప్రతినిధి

Published: Wednesday November 09, 2022
 మార్కెట్ కమిటీ చైర్మన్ ఎవరికి దక్కేనో?చైర్మన్ పదవి కోసం రేస్ లోకి వచ్చిన మరి కొంతమందిజడ్పీ చైర్మన్ కమల్ రాజు ఆశీస్సులు ఎవరికి?మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ పొందేందుకు పలువురి బీసీ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బీసీ సామాజిక వర్గానికి రిజర్వు చేయబడింది. ఈసారి మధిర మార్కెట్ కమిటీ బోనకల్ మండలానికి కేటాయిస్తారని, గతంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి అన్ని వర్గాల ప్రజలు నాయకులకు కలుపుకుని నాయకుడిని . నియోజకవర్గంలో బీసీల్లో అత్యధిక ఓట్లు కలిగిన  సామాజిక వర్గానికి ఈసారి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వాలని ఆలోచనలో మంత్రి అజయ్ కుమార్ కమల్ రాజు ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన ఇటీకాల ఎర్రుపాలెం మండలం మధిర మండలం బోనకల్ మండలం నుండి నాయకులు రేసులో ఉన్నారు. కాపు సామాజిక వర్గం నుండి త్వరలో ఎన్నికల సమయం కావడంతో ఒకరికి ఇస్తే మరొకరు అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉన్నందున ఎన్నికలు అయిపోయే వరకు మార్కెట్ కమిటీ చైర్మన్ భర్తీ చేయకుండా ఉంటేనే మంచిదని మరో సామాజిక వర్గం తమ అభిప్రాయాన్ని కమల్ రాజు దృష్టికి తీసుకెళ్లిన్నారు.బిజీగా ఉన్న జడ్పీ చైర్మన్ కమల్ రాజ్ దీనిపై త్వరలో జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవం వస్తున్న సందర్భంగా ఆ తర్వాత పరిష్కారం ఉంటుంది ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.