శ్రీ మృత్యుంజయ స్వామి వారి దేవస్థానం, శివాలయం దాతలు సహకారం అన్నదానం

Published: Tuesday November 23, 2021
మధిర నవంబర్ 22 ప్రజాపాలన ప్రతినిధి : మధిర శివాలయంలో దాతల సహకారంతో ప్రతి సోమవారం శివాలయంలో అన్నదానం జరుగును ఈరోజు అన్నదాతలు శ్రీ పబ్బతి రమేష్ ధర్మపత్ని సత్య రాజేశ్వరి కుమారుడు రామచంద్ర ఆంజనేయ మణికంఠ, రాళ్లబండి రాంబాబు ధర్మపత్ని వెంకటలక్ష్మి, కుమారుడు అభిరామ రాజు కూతురు రేవతి గొడరుధిర, ఖమ్మం శ్రీరామ నేని రాకేష్ ధర్మపత్ని రాజేశ్వరి, దోసపాటి ప్రభాకర్ రావు ధర్మపత్ని లక్ష్మి కుమారుడు విజయ్ కుమార్, ధర్మపత్ని అనుపమ కూతురు రిషిత ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్తీకమాసంలో మూడవ సోమవారం అన్నదాన కార్యక్రమం చేయడం మా అదృష్టంగా భావిస్తూ అన్నం పరబ్రహ్మస్వరూపం అని పేదలకు అన్నదానం చేయడం వల్ల మా కుటుంబానికి ఈశ్వరుడు దీవెనలు ఉండాలని మాకు కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీ వంకాయలపాటి నాగేశ్వరరావు ధర్మకర్త పబ్బతి రమేష్, పూజారులు రాయప్రోలు వెంకట సత్యనారాయణ శర్మ మరియు కమిటీ మెంబర్స్, ఆలయ సిబ్బంది మరియు మైనీడి జగన్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు