పేద వారిని ఆదుకోవడానికి ముందుకు రావాలి : కంజర్ల కృష్ణమూర్తి చారి

Published: Tuesday June 08, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు మరియు కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ కంజర్ల కృష్ణమూర్తి చారి తమ ఫౌండేషన్ తరపున లింగంపల్లి పరిసర ప్రాంతంలోని 60 మంది నిరాశ్రయులకు మధ్యాహ్న భోజనాన్ని అందజేశారు, కృష్ణమూర్తి చారి మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఎన్నో కష్టాలు పడుతూ రోడ్లపై తమ జీవనాన్ని కొనసాగిస్తున్న వారికి తమ వంతు సహాయంగా అన్నదానం చేశామని, అందరూ కష్టాల్లో ఉన్న వారికి తమ వంతు సహాయాన్ని అందించగలరని అన్నారు, ఈ కార్యక్రమంలో రాజేందర్ చారి, శ్రీ బాలాజీ ఫౌండేషన్ బలరాం, సుభాష్, తరుణ్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.