మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే ను కలిసిన ఏసీపీ ఎడ్ల మహేష్

Published: Thursday October 14, 2021

బెల్లంపల్లి, అక్టోబర్ 13, ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి సబ్ డివజనల్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ గా ఇటీవల నియమితులైన ఎడ్ల మహేష్ స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను బుధవారం నాడు  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుర్గం ఏసిపి మహేష్ ను అభినందిస్తూ బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించి చట్టపరంగా తగిన సహాయ సహకారాలను అందించాలని, బెల్లంపల్లి సబ్ డివిజన్ కు మంచి పేరు తేవాలని ఆయన సూచించారు.