మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే ను కలిసిన ఏసీపీ ఎడ్ల మహేష్
Published: Thursday October 14, 2021
బెల్లంపల్లి, అక్టోబర్ 13, ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి సబ్ డివజనల్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ గా ఇటీవల నియమితులైన ఎడ్ల మహేష్ స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను బుధవారం నాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుర్గం ఏసిపి మహేష్ ను అభినందిస్తూ బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించి చట్టపరంగా తగిన సహాయ సహకారాలను అందించాలని, బెల్లంపల్లి సబ్ డివిజన్ కు మంచి పేరు తేవాలని ఆయన సూచించారు.
Share this on your social network: