కంటి వెలుగు దేశానికి ఆదర్శం కంటి వెలుగును విజయవంతం చేద్దాం జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు

Published: Friday February 17, 2023

 ఎర్రిపాలెం ఫిబ్రవరి 16 ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలో పలు గ్రామాల్లో హాజరై తెలంగాణ ప్రభుత్వం హయాం లోనే గ్రామాల అభివృద్ధి ఎర్రుపాలెం మండలం లో కంటి వెలుగు, గ్రామాలలో సిసి రోడ్ల శంకుస్థాపన, పలు శుభకార్యాలకు హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ఎర్రుపాలెం మండలం జమలాపురం రైతు వేదికలో జరుగుతున్నటువంటి కంటి వెలుగు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు, అనంతరం జమలాపురంలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు.ఎర్రుపాలెం రైతులు సాగర్ నీళ్లు సమస్య వివరించగా తక్షణమే రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ సమస్యను వివరించడం జరిగింది, మంత్రివర్యులు వెంటనే స్పందించి ఉన్నత అధికారులతో మాట్లాడి వెంటనే సమస్యను పరిష్కరిస్తామని తెలియజేయడం జరిగింది.అనంతరం బంజర గ్రామంలో నూతన సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారుఅనంతరం ఎర్రుపాలెం మండల కేంద్రంలో సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు.ఎర్రుపాలెం మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి నల్లమోతు విజయ్ కుమార్ తమ్ముడు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.మీనవోలు గ్రామంలో జరుగుతున్నటువంటి నరసింహారావు కుమారుని ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి హాజరై కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు తాసిల్దార్ ఎంపీడీవో  బి ఆర్ ఎస్ అధ్యక్షుడు పంబ శివ చావా రామకృష్ణ ఎంపీపీ శిరీష చిరంజీవి రామ్ కోటేశ్వరావు అప్పారావు పలువురు నాయకులు  పాల్గొన్నారు