కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన మేయర్ జక్క వెంకట్ రెడ్డి
Published: Tuesday March 14, 2023
మేడిపల్లి, మార్చి13 (ప్రజాపాలన ప్రతినిధి)
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్లో తెలంగాణ రాష్ట్ర
ప్రభుత్వం చేపట్టిన రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని స్థానిక కార్పొరేటర్ సుభాష్ నాయక్, కమిషనర్ రామకృష్ణారావులతో కలిసి మేయర్ జక్కా వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పెంటయ్య గౌడ్, జావిద్ ఖాన్, 2వ డివిజన్ అధ్యక్షులు పగడాల బాలరాజు, కార్యదర్శి పరకాల శ్రీనివాస్, ఎస్వి కాలనీ అధ్యక్షులు రాధాకృష్ణ రావు, కార్యదర్శి నరసింహ నరసింహ, కమలానగర్ కాలనీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, కార్యదర్శి నరసింహ, శ్రీ సాయి నగర్ ఈస్ట్ అధ్యక్షులు ఉపేందర్, కార్యదర్శి నవీన్ రెడ్డి, కాకతీయ నగర్ కాలనీ కార్యదర్శి జాంగిర్, బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు సురేందర్ రెడ్డి, శంకరిచారి, కిరణ్ నాయక్ ఉపేందర్ ధరణి కాలనీ అధ్యక్షులు పురుషోత్తం, ఉపాధ్యక్షులు తండా శ్రీనివాస్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: