విద్యుత్ విషయంలో రాకపోకల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Published: Friday July 23, 2021
పరిగి 22 జూలై ప్రజాపాలన ప్రతినిధి : జిల్లా లో భారీ వర్షాలు కురుస్తూ ఉంటడం వల్ల జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్సై దేవంబొట్ల రాజు పత్రికా ప్రకటన లో తెలిపారు, కరెంటు ట్రాన్స్ఫరమ్స్, స్తంభాలను ముట్టుకోకుండా చిన్నపిల్లలను దూరంగా ఉంచాలి అని, పాడుపడ్డ ఇండ్లల్లో ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, గ్రామాలకు వెళ్ళే రోడ్లు గాని, రహదారులు గాని, పొలాలకి వెళ్ళే బాటాలుగాని కొట్టుకో పోయే అవకాశం ఉంది అని అన్నారు. ఏదైనా ప్రాంతం లో రోడ్లు, వంతెనలు తెగిపోయి రాకపోకలు నిలిచిపోయి ప్రజలకు ఇబ్బందికర పరిస్థిది ఏర్పడిన  కు డయల్ 100 ఫిర్యాదు చేయాలని లేదా పోలీస్ అధికారులకు తెలపాలని, అన్నారు. చెరువులు, కుంటలు, వాగులు నీటితో నిండి ఉప్పొంగుతుంటాయి, వాగులు ప్రమాద స్థాయిలో పరుగులు పెడుతున్న సమయం లో ఎట్టి పరిస్థితుల్లో వాగులు దాటే ప్రయత్నం చేయకూడదు తెలిపారు. వర్షం నీటితో రోడ్లు పూర్తిగా తడిసి ఉంటాయి కావున వాహనాలు రోడ్ల పైన జారీ వాహనాలు ప్రమాదలకు గురి అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి కావున వాహనదారులు నెమ్మదిగా తమ గమ్యాలను చేరుకొని ప్రమాధాలను నిర్మూలించాలని, జిల్లాలో శాంతి భద్రతలను కాపాడుతూ, జిల్లా ప్రజల సంక్షేమం లో కూడా పోలీస్ అధికారులు ఎల్లపుడూ ముందు వరసలో ఉంటారని ఎస్సై రాజు తెలిపారు.