ఘనంగా నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ రాజర్శి భగీరథ జయంతి వేడుకలు : జిల్లా కలెక్టర్ పౌసుమి బసు

Published: Thursday May 20, 2021
వికారాబాద్, మే 19, ప్రజాపాలన బ్యూరో : శ్రీ శ్రీ శ్రీ రాజర్శి భగీరథ జయంతి వేడుకలను పురస్కరించుకొని బుధవారం కలెక్టరేట్ లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ జయంతిని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరాడంబరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పౌసమి బసు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన  గావించి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా బి.సి.సంక్షేమ శాఖ అధికారిణి పుష్పలత గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి మల్లేశం, కలెక్టరేట్ కార్యాలయ ఏవో హరిత దేవి, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.