ఘనంగా నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ రాజర్శి భగీరథ జయంతి వేడుకలు : జిల్లా కలెక్టర్ పౌసుమి బసు
Published: Thursday May 20, 2021
వికారాబాద్, మే 19, ప్రజాపాలన బ్యూరో : శ్రీ శ్రీ శ్రీ రాజర్శి భగీరథ జయంతి వేడుకలను పురస్కరించుకొని బుధవారం కలెక్టరేట్ లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ జయంతిని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరాడంబరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పౌసమి బసు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన గావించి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా బి.సి.సంక్షేమ శాఖ అధికారిణి పుష్పలత గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి మల్లేశం, కలెక్టరేట్ కార్యాలయ ఏవో హరిత దేవి, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: