జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

Published: Tuesday August 02, 2022
ఆసిఫాబాద్ జిల్లా ఆగస్టు01(ప్రజాపాలన, ప్రతినిధి) : సమాజంలో మంచి మార్పులు తీసుకురావడానికి జర్నలిస్టులు ప్రముఖ పాత్ర పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. 2022, 23, కు సంబంధించి జర్నలిస్టులకు అందించే అక్రిడేషన్ కార్డుల పంపిణీ డిపిఆర్ఓ కృష్ణమూర్తి తో కలిసి సోమవారం ప్రారంభించి అక్రిడేషన్ కమిటీ మెంబర్లకు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో మంచి మార్పు తీసుకురావాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందన్నారు. జిల్లాలో  మరింత చురుకుగా జర్నలిస్టులు పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్ఓ కృష్ణమూర్తి, అక్రిడేషన్ కమిటీ మెంబర్లు రవి నాయక్, అబ్దుల్ రెహమాన్, ప్రకాష్ గౌడ్, సంతోష్, చందు, రమేష్, తుకారాం,తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area