శుభ్రత పాటించండి-ఆరోగ్యంగా ఉండండి

Published: Friday September 02, 2022

గురుకుల విద్యార్థులకు డాక్టర్ వెంకటేష్ మధిర సెప్టెంబర్ 1 ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలో గురువారం నాడు
మాటూరు పేట వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్  ఆధ్వర్యంలో కృష్ణాపురం తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల యందు వైద్య శిబిరము ఏర్పాటు చేసి విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి తగిన మందులు ఇవ్వనైనది. ఈ సందర్భంగా డావెంకటేష్ మాట్లాడుతూ                 విద్యార్థులకు శరీర శుభ్రత, పరిసరాల పరిశుభ్రత, చేతుల శుభ్రత పై ఆరోగ్య అవగాహన కల్పించడం జరిగినది.. పిల్లలు తినే ఆహారం , సానిటేషన్ పరిశీలించి తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రిన్సిపాల్ కి తెలియపరచమైనదిఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎస్కే షమీం మేడం, ఆరోగ్య పర్యవేక్షణ అధికారి భాస్కర్ రావు, సి హెచ్ ఓసుభాషిని, స్టాఫ్ నర్స్ శ్రీలత  పాల్గొన్నారు.