బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న కరోనా టెస్టులు

Published: Friday May 21, 2021
సంగారెడ్డి, మే 20 (ప్రజాపాలన ప్రతినిధి) : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో కరోనా టెస్టులు కొనసాగుతున్నాయి. గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 49 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 6 మందికి పాజిటివ్ రిపోర్టులు వచ్చినట్లు డాక్టర్ రాధిక పేర్కొన్నారు. జిల్లా వైద్య అధికారుల ఆదేశాల ప్రకారం వ్యాక్సిన్ కార్యక్రమం రద్దు చేసినట్లు ఆమె తెలిపారు.