జిల్లా కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలసిన ప్రొఫెసర్ డా.పి.జితేందర్
Published: Saturday January 29, 2022
కొడిమ్యాల, జనవరి 28 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా కలెక్టర్ జి.రవి గురువారం ఎం.జి.ఎం. అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.పి.జితేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా డా.పి.జితేందర్ తో కలెక్టర్ మాట్లాడుతూ వైద్యపరమైన అవసరతలలో తన దృష్టికి తీసుకువచ్చిన ప్రభుత్వ పరంగా తనవంతు సహకారాన్ని అందిస్తానని తెలిపారు. డా.పి. జితేందర్ జగిత్యాల జిల్లా ఇంచార్జ్ డి.ఎం.హెచ్.ఓ. గా, వివిధ ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యులు గా సేవలందించి అవార్డులను సాధించినవిషయం తెలిసిందే. ఆయనవెంట కొడిమ్యాల యువజన నాయకులు కాయిత రాజు ఉన్నారు.
Share this on your social network: