కలిసి శ్రమిద్దాం.. ప్రగతిని సాదిద్దాం మైత్రి డెవలపర్స్ అధినేత శ్రీనివాస్..

Published: Monday February 13, 2023

 తల్లాడ, ఫిబ్రవరి 12 (ప్రజాపాలన న్యూస్): సమాజంలో ప్రతి ఒక్కరూ కలిసి శ్రమిస్తే.. ప్రగతిని సాధించవచ్చునని మైత్రి డెవలపర్స్ అధినేత శెట్టి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం తల్లాడలో ఆయన మాట్లాడుతూ తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాడు.  వ్యాపారం(బిజినెస్) లో రాణించాలంటే కృషి, పట్టుదల, అంకితభావం ఉండాలన్నారు.  చిన్ననాటి నుండి పాత సైకిల్ తొక్కే నేను ఈ స్థాయికి రావడానికి కారణం శ్రమతో పాటు పట్టుదలే కారణమ  న్నారు. ప్రతిఒక్కరికి సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధించవచ్చునన్నారు. వ్యాపారంలో తాను ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయవంతంగా నడిపినట్లు గుర్తు చేశారు. రెండు నెలల్లో తల్లాడలో ఈ వెంచర్ అమ్మకాలను కూడా పూర్తి చేస్తానని తెలిపారు. తర్వాత జిల్లాలో మరో వెంచర్ ను ప్రారంభిస్తామని తెలిపారు. తన వ్యాపారంలో పురోభివృద్ధికి సహకరిస్తున్న మిత్రులందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.  సమాజంలో యువకులకు ప్రతిఒక్కరికి ఆయన సలహా ఇస్తూ ఏదైనా పట్టుదలతో సాధిస్తే విజయం సొంతం అవుతుందని ఈ సందర్భంగా శ్రీనివాస్ అన్నారు.