గచ్చిబౌలి కార్పొరేటర్ కి వినతి పత్రం అందజేసిన భేరీ రామచందర్ యాదవ్

Published: Thursday April 22, 2021

శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ అధ్యక్షులు భేరీ రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో కాలనీలో కొన్ని వీధుల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిసి రోడ్లు లేవని వాటిని త్వరగా నిర్మించాలని కోరుతూ గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కాలనీలో కొన్ని వీధుల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేవు120 నుండి 151 వరకు  600 నుండి 6 24 వరకు 420 నుండి 439 వరకు 90 నుండి 101 వరకు 52 నుండి 62 వరకు 62 నుండి 72 వరకు 1 నుండి 20 వరకు 303 నుండి 315 వరకు 500 నుండి 512 వరకు 375 నుండి 384 వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలని కోరారు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, అదేవిధంగా కొన్ని గల్లీలో సిసి రోడ్లు లేవు 601 నుండి 610 వరకు 577 నుండి 584 వరకు 568 నుండి 577 వరకు 548 నుండి 560 వరకు 380 నుండి 403 వరకు 374 నుండి 390 వరకు 477 నుండి 468 వరకు 440 నుండి 450 వరకు 468 నుండి 478 వరకు త్వరగా కాలనీలో మౌలిక వసతుల కొరకు కృషి చేయాలని కోరారు. దీనికి కార్పొరేటర్ సానుకూలంగా స్పందిస్తూ కాలనీకి జిహెచ్ఎంసి అధికారులను తీసుకొచ్చి ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కె నరసింహ యాదవ్, బుచ్చయ్య యాదవ్, ఉపాధ్యక్షులు రాయుడు, శివకుమార్, చంద్రశేఖర్ యాదవ్, సంజీవ, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.