పెంచిన డీజిల్ పెట్రోల్ సిలెండర్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ నాయకులు ధర్నా
Published: Wednesday February 17, 2021
జగిత్యాల, ఫిబ్రవరి 16 (ప్రజాపాలన): జగిత్యాల పట్టణంలోని తహసిల్ చౌరస్తాలో జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్ డీజిల్ సిలెండర్ ధరలను వెంటనే తగ్గించాలని రహదారిపై బైఠాయించి ధర్నా నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్దం చేయగా పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు గుండ మధు కౌన్సిలర్ నక్క జీవన్ కోర్టు శ్రీనివాస్ రియాజ్ మహేష్ బాపురెడ్డి సింహారాజు ప్రసాద్ నాగేంద్ర రాజేష్ తోట నరేష్ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: