వైఎస్ఆర్ టిపి అధినేత్రి షర్మిల నిరుద్యోగ దీక్ష

Published: Wednesday March 16, 2022
వైఎస్ఆర్ టిపి జిల్లా మహిళా కన్వీనర్ పి.సుధారాణి
వికారాబాద్ బ్యూరో 15 మార్చి ప్రజాపాలన : వైఎస్ఆర్ టిపిని గడపగడపకు చేర్చడమే లక్ష్యంగా వైఎస్ఆర్ టిపి అధినేత్రి షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర కొనసాగుతున్నదని జిల్లా మహిళా కన్వీనర్ పి.సుధారాణి అన్నారు. మంగళవారం వలిగొండ మండలం బూర్లగడ్డ గ్రామంలో నిరుద్యోగ దీక్షలో భాగంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలతో కలిసి అడుగులో అడుగేసుకుంటూ బయలు దేరారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా కన్వీనర్ మాట్లాడుతూ పార్టీని ప్రజల చెంతకు చేర్చడమే లక్ష్యంగా ప్రజా ప్రస్థానం పాదయాత్ర లక్ష్యమని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత తండోపతండాలుగా తరలి వస్తున్నారని వివరించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా కంటకంగా మారిందని విమర్శించారు. సిఎం కెసిఆర్ కుటుంబ పాలనకు స్వస్తి చెప్పాల్సిన ఆవశ్యకత ఉందని వెల్లడించారు. దళిత బంధును పారదర్శకంగా నిర్వహించకపోవడంతో దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని గుర్తు చేశారు.