పౌష్టికాహారం అందరికి చేరాలి : సర్పంచ్ కె రాజిరెడ్డి

Published: Tuesday July 20, 2021
పరిగి 19 జూలై ప్రజా పాలన ప్రతినిధి : గర్భిణీలకు బాలింతలకు ప్రభుత్వం ద్వారా వచ్చే నిత్యావసర వస్తువులు అందరికి చేరేలా చూడాలని దోమ మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు కె రాజిరెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలోని సోమవారం అంగన్వాడీ కేంద్రంలో బాలింతలకు గర్భిణీలకు పాలు పప్పు కోడిగుడ్లు బియ్యం లను అంగన్వాడీ కార్యకర్త జి నిర్మల తో కలిసి పంపిణి చేసారు. అనంతరం వివరాలను అడిగి తెలుసుకొని అర్హులందరికీ అందించాలని కోరారు.