యూవశక్తి యూత్ గణేష్ మండలి ఆద్వర్యంలో లక్ష్మీ గణపతి హోమం
Published: Tuesday September 06, 2022
జన్నారం, సెప్టెంబర్ 05, ప్రజాపాలన: మండలంలోని అన్ని గ్రామాలలో వినాయక చవితిని సందర్భంగా గణనాథుడు కోలువుదీరాడు. గణపతి నవరాత్రులలో ఉత్సవాల్లో భాగంగా మండలంలోని పలు వినాయకుడి వద్ద తొమ్మిది రోజులు అన్నాదాన కార్యక్రమం చేపట్టనుంటట్లు నిర్వహకులు తెలిపారు. సోమవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పోన్కల్ గ్రామంలో యూవశక్తి యూత్ గణేష్ మండలి ఆద్వర్యంలో వెద పండితులు వెంకటేశ్వర స్వామి ఆలయా అర్చకులు హరిదాస్ చారి సమక్షంలో లక్ష్మీ గణపతి హోమం కార్యాక్రమం నిర్వహించారు. గణనాథుని పూజ అనంతరం వినాయకుడి వద్ద అన్నాదాన జరిపించారు. ఈ కార్యాక్రమంలో ఎంపిపి మదాడి సరోజన, పోన్కల్ సర్పంచ్ జక్కు భూమేష్, గ్రామ కమిటీ అధ్యక్షుడు మర్రిపేళ్లి అంజయ్య, యూవశక్తి యూత్ సభ్యులు, మహిళలు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: