శ్రీ వాసవి కళ్యాణ మండపం లో ఘనంగా మిర్యాల నారాయణ గుప్తా 39 వ వర్ధంతి
Published: Monday August 23, 2021
మధిర, ఆగస్టు 22, ప్రజాపాలన ప్రతినిధి : మధిర గాంధీ బిరుదాంకితులు, ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు, కీర్తిశేషులు దేశభక్త శ్రీ మిర్యాల నారాయణ గుప్తా 39వ వర్ధంతి ఈ రోజున శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం ఉపాధ్యక్షులు మరియు కోశాధికారి పుల్లకండం చంద్రశేఖర్ చంద్రశేఖర్, నాళ్ళ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు P చంద్రశేఖర్ మాట్లాడుతూ శ్రీ విరియాల నారాయణ గుప్త సేవలను కొనియాడారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు, శ్రీ ఇరుకుళ్ళలక్ష్మీ నరసింహారావు, మాధవరపు నాగేశ్వరరావు, మిర్యాల రమణ గుప్తా, పల్ల పోతు ప్రసాదు, చారు గుండ్ల నరసింహమూర్తి, కుంచం కృష్ణారావు, చెడే కోటేశ్వరరావు, మిరియాల హ్యాపీ విశ్వేశ్వర రావు, ఎర్ర లక్ష్మణ్, సిరిపురం శ్రీను, గుండెల సూర్య ప్రకాశరావు, ఆర్య వైశ్య కళ్యాణ మండపం కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: