ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ను గెలిపించండి
Published: Thursday February 25, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉపాధ్యాయులను కోరారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులను కలిసి ఓట్లు అడిగి మాట్లాడుతూ పట్టభద్రుల హక్కులకు పోరాడుతానని, నిరుద్యోగుల సమస్యలపై శాసన మండలిలో గొంతెత్తుతానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బందురూప నర్సింహ, ఎడవెళ్లి నర్సింహ, రాజీరు మదు, బైరు సైదులు, నల్లబోలు వెంకటేష్, మత్స్యగిరి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: