మధిరలో ప్రశాంతంగా ముగిసిన టెట్ పరీక్ష
Published: Monday June 13, 2022
నిర్వహణాదికారులు తహసీల్దార్ కె రాజేష్, యంఇఓ వై ప్రభాకర్ మధిర ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలోఆదివారం నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన టెట్ పరిక్షలలో భాగంగా ఈరోజు మధిరలోని ఠాగూర్ హైస్కూల్,సుశీల జూనియర్ కాలేజీ,సెంట్ ఫ్రాన్సిస్ హైస్కూల్ , నారాయణ బెస్ట్ ఫౌండేషన్ స్కూల్, శ్రీనిధి కాన్సెప్ట్ స్కూల్, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ సెంటర్ లలో ఉదయం, మధ్యాహ్నం టెట్ పరిక్ష ప్రశాంతంగా పూర్తి అయ్యాయని పరిక్ష నిర్వహణాదికారులు తహసీల్దార్ కె రాజేష్, యంఇఓ వై ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు.
మధిరలోని 6 సెంటర్ లలో ఉదయం 1308 మందికి 132 ఆబ్సెంట్ కాగా మధ్యాహ్నం 1321 మందికి 119 మంది ఆబ్సెంట్ కావటం జరిగిందని తెలిపారు. పరీక్షను ప్రశాంతంగా నిర్వహించిన పరీక్ష కేంద్రాల అధికారులకు పేరు పేరునా ధన్యవాదములు తెలియజేసారు.
Share this on your social network: