మాటూరు గ్రామపంచాయతీ నందు ప్రతి ఇంటింటికీ మొక్కలు పంచు కార్యక్రమం
Published: Monday July 19, 2021
మధిర, జులై 18, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండల పరిధిలోగల మాటూరు పంచాయతీ నందు మాటూరు మరియు ఎస్సీ కాలనీ బి.సి.కాలనీ ప్రజలకు గత ఎనిమిది రోజుల నుంచి ఇంటింటికి మొక్కలు పంచి పెట్టడం జరిగింది అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆదివారం ఎస్సీ కాలనీ బి.సి.కాలనీ వాసులకు ప్రతి ఇంటికి మొక్కలు పంచి పెట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐదవ వార్డు నెంబర్ మేడిశెట్టి వరలక్ష్మి చేతుల మీదుగా ఐదో వార్డులో అందరికీ మొక్కలు పంచి పెట్టినారు ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్స్ గ్రామ పంచాయతీ సిబ్బంది ఎస్ కే జానీ రాయబారపు కాటయ్య గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది
Share this on your social network: