పశువులకు గాలి కుంట టీకాలు తప్పనిసరి

Published: Wednesday October 27, 2021
సర్పంచ్ చెరుకూరి అండాలుగిరి
ఎంపిటిసి చెరుకూరి మంగ రవీందర్
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 26, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామంలో పాడి రైతులు పశువులకు గాలికుంట టీకాలు తప్పనిసరిగా వేయించాలని పోల్కంపల్లి సర్పంచ్ చెరుకూరి అండాలుగిరి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పోల్కంపల్లిలో ఎంపిటిసి మంగ రవీందర్ తో కలసి పశువులకు టీకా వేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. రైతులు ఎప్పటికప్పుడు పశువుల్లో వొచ్చే రోగాలను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు. పోల్కంపల్లి. జాజొని బావి. మాన్య గూడ. ఎంగల్ గూడా  గ్రామంలోని ప్రతి రైతు టీకా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారులు కవిత, పురుషోత్తం, ప్రవీణ్, రైతులు గూడం అశోక్ దితరులు పాల్గొన్నారు.