రామాలయం అందరు సహకారంతో అభివృద్ధికి కృషి చేస్తా. చైర్మన్

Published: Saturday March 11, 2023
మధిర మార్చి 10 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు రామాలయం చైర్మన్ నూతన పాలకవర్గ కమిటీ నియమతులైనందుకు 
మధిర రామాలయం నూతన కమిటీకి చైర్మన్గా ఎన్నికైన పల్లబోతుల ప్రసాదరావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అవకాశం ఆ దైవం నాకు కల్పించిందిగా భావిస్తున్నా అన్నారు. దేవాలయ కమిటీ చైర్మన్గా నాపై నమ్మకం ఉంచి నియమించినందుకు జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మధిర లో ఎంతో పేరుగాంచినరెండోభద్రాచలంమధిరరరామాలయం అభివృద్ధికి తాను కమిటీతో కలిసి పనిచేస్తామన్నారు. దేవాలయ కమిటీ పెద్దల అందరు సహకారం అన్నిరాజకీయ పార్టీలయ సహకారంతో అభివృద్ధి పనులకు కృషి చేస్తానని తెలిపారు.