2వ విడత గొర్రెల పంపిణికి సమావేశం జడ్పిటిసి అరిగెల నాగేశ్వర్ రావు,

Published: Tuesday August 02, 2022
ఆసిఫాబాద్ జిల్లా ఆగస్టు 01 (ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లా కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం రాబోయే 2 వ విడత గొర్రెల పంపిణీ సదస్సు కార్యక్రమంలో తెరాస రాష్ట్ర సహాయ కార్యదర్శి, జెడ్పీటీసీ అరిగేలా నాగేశ్వర్ రావు,పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ విడతగా సుమారు 391 యూనిట్ల పంపిణీ ఉంటుందని, దానికి సంబంధించిన డీడీ లను సకాలంలో చెల్లించాలన్నారు. గతంలో రూ 1లక్ష 20వేలు  ఉందని, ప్రస్తుతం రూ 1లక్ష 55 వేలు వస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ నెల 19వ తేదీ కృష్ణాష్టమి సందర్భంగా యాదవులు అందరూ ఘనంగా వేడుకలు చేయాలని,మరియు శోభాయాత్ర కు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ యాదవ్, ఎంపీడీవో శశికళ, సురేష్ కుమార్, మురళీకృష్ణ, యాదవ సంఘం సభ్యులు  పాల్గొన్నారు.