పేద ప్రజలకు వైద్య సేవలు అందించడమే లక్ష్యం

Published: Saturday January 28, 2023
* సబితా ఆనంద్ పౌండేషన్ చైర్ పర్సన్ డాక్టర్ మెతుకు సబితా ఆనంద్
వికారాబాద్ బ్యూరో 27 జనవరి ప్రజాపాలన : పేద ప్రజలకు వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని సబితా ఆనంద్ పౌండేషన్ చైర్ పర్సన్ డాక్టర్ మెతుకు సబితా ఆనంద్ అన్నారు. శుక్రవారం బంట్వారం మండల పరిధిలోని సల్బత్తాపూర్ గ్రామంలో సబితా ఆనంద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సబితా ఆనంద్ చైర్ పర్సన్ మాట్లాడుతూ 400  మంది ప్రజలకు వైద్య సేవలు అందించి, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి తగు సూచనలు చేసి మాత్రలు అందించామని స్పష్టం చేశారు. పేద ప్రజలకు వైద్యం అందించాలనే దృఢ సంకల్పంతో గ్రామాల్లో సబితా ఆనంద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వైద్య సేవలు వినియోగించుకుంటున్న పేద ప్రజలు చూపిస్తున్న ప్రేమాభిమానాలతో మాకు ఎంతో ఆనందంగా ఉందని, పేద ప్రజలకు సేవ చేయడానికి ఎల్లప్పుడూ తమవంతుగా కృషి చేస్తామన్నారు.