ఫీజు రీయింబర్సుమెంట్ వెంటనే విడుదల చేయాలి

Published: Thursday June 09, 2022

కోరుట్ల, జూన్ 08 ( ప్రజాపాలన ప్రతినిధి ): పట్టణములో జరిగిన విలేఖర్ల సమావేశాల్లో ఎన్.ఎస్.యు.ఐ జగిత్యాల జిల్లా అధ్యక్షులు సదుల వినయ్ మాట్లాడుతూ రాష్ట్రం లో ఉన్న ప్రవైట్ విద్యా సంస్థలలో చదువుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టి, మైనార్టీ, విద్యార్థులు ఫీజు రీయింబర్సుమెంట్  బకాయలు  రాష్ట్ర ప్రభుత్వం వెంటనే  విడుదల చేయాలని అన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్సుమెంట్ విడుదల చేయకపోవడం విద్యార్థులు ఫీజులు చెల్లించలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని,  రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యార్ధి వ్యతిరేక విధానాల వల్ల విద్యార్థులు త్రీవ మానసిక ఆవేదన చెందుతున్నారని, ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్సుమెంట్  బకాయలు విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలి ఎన్.ఎస్.యు.ఐ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు సదుల వినయ్ డిమాండ్ చేశారు.