కట్టగాంధీ ఆధ్వర్యంలో ఆర్థికసాయం

Published: Tuesday October 12, 2021
మధిర, అక్టోబర్ 11, ప్రజాపాలన ప్రతినిధి : మధిర పట్టణంలోని హరిజనవాడ కాలనీలో విద్యుత్ ప్రమాదం కారణంగా నష్టపోయినా కోమటి రాజేశం కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి 22వ వార్డు కౌన్సిలర్ కట్ట గాంధీ నేతృత్వంలో వారి కుటుంబానికి దాతల సహకారంతో ఆర్థిక సహకారం అందజేసిన సిపిఎం పార్టీ మధిర పట్టణ కార్యదర్శి మండవ ఫణీంద్ర కుమారి, మరియు పట్టణ కమిటీ సభ్యులు అనుమోలు భాస్కర్ రావు, వాసిరెడ్డి సుందరయ్య, ఆవుల శ్రీనివాసరావు, తేలప్రోలు రాధాకృష్ణ, పంతంగి నాగయ్య, పెంటి వెంకట్రావు, మల్లా చారి తదితరులు పాల్గొన్నారు