రాహుల్ జోడో యాత్రకు తరలిన కాంగ్రెస్ నాయకులు

Published: Tuesday October 25, 2022
మధిర  అక్టోబర్ 23 (ప్రజా పాలన ప్రతినిధి) కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన జూడో పాదయాత్రలో పాల్గొనేందుకు మధిర యూత్ కాంగ్రెస్ మరియు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వెళుతున్న వాహనాల ర్యాలీని  పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిరియాల రమణ గుప్తా యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు తుమాటి నవీన్ రెడ్డి జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలు మేరకు తెలంగాణకు వచ్చిన రాహుల్ గాంధీ పాదయాత్రకు మధిర కాంగ్రెస్ నాయకులు భారీగా తరలి వెళ్లి ఘన స్వాగతం పలికినట్లు వారు తెలిపారు. ఈ పాదయాత్రలో పాల్గొనేందుకు
మధిర నియోజకవర్గ మరియు మదిర మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జూడో పాదయాత్రలో పాల్గొనేందుకు తెలంగాణ శాసనసభ పక్ష నేత శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క నాయత్వములో పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిర్యాల రమణ గుప్తా నియోజకవర్గ యువజన కాంగ్రెస్ కాంగ్రెస్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డి మధిర మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవికుమార్ ఆధ్వర్యంలో యూత్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మధిర నుండి తరలి వెళ్లడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు ఆదిమూలం శ్రీనివాసరావు, మైలవరపు చక్రి, కోటా డేవిడ్, షేక్ ఇస్మాయిల్, మారబత్తుల మోహన్ రావు, ఎస్ రాజేష్, నెల్లూరు విజయ్ పోచపల్లి సురేష్, ఏం జంపయ్య, కే గోపాల్ సుధాకర్ రెడ్డి, కే డేవిడ్, సురేష్, చంటి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.