ప్రజా ఫిర్యాదుల విభాగానికి స్పందన కరువు
Published: Tuesday December 13, 2022
జన్నారం, డిసెంబర్ 12, ప్రజాపాలన: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగం ప్రజావాణి కార్యక్రమానికి స్పందన కరువైందని ఎంపీడీవో అరుణాని తెలిపారు. సోమవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కేంద్రంలో మాట్లాడుతూ గత 60 రోజుల నుండి అధికారులు ఎంపీడీవో కార్యాలయం ఉదయం 10 గంటల నుండి మూడు గంటల వరకు ఒక ఫిర్యాదు కూడా రావడం లేదన్నారు. గత రెండు నెలల నుండి ఒకే ఒక్క ఫిర్యాదు వచ్చిందని ఎంపీడీవో తెలిపారు. కార్యాలయంలో సమయం వృధా అవుతుందని అధికారులు వాపోతున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రమేష్, తాసిల్దార్ కార్యాలయం అధికారులు, జన్నారం గ్రామ సర్పంచ్ భూషణవేణి గంగాధర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: