మంత్రి మేయర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ సుభాష్ నాయక్

Published: Monday January 02, 2023
మేడిపల్లి, జనవరి1 (ప్రజాపాలన ప్రతినిధి)
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పీర్జాదిగూడ కార్పొరేషన్ 2వ డివిజన్ కార్పొరేటర్ డా. కేతావత్ సుభాష్ నాయక్  నేతృత్వంలో పలు కాలనీల పాలకవర్గ సభ్యులు మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకొని మంత్రిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం డివిజన్ కాకతీయ నగర్ కు చెందిన బీఆర్ఎస్  నాయకులు జిల్లెల్ల దయాకర్ రెడ్డి పుట్టిన రోజు సందర్బంగా మంత్రి శాలువా కప్పి ఆశీర్వదించారు. అనంతరం మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డిని, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్ర రెడ్డిని ప్రతాప సింగారంలోని వారి నివాసంలో, మేడిపల్లిలోని పార్టీ కార్యాలయంలో మేయర్ జక్క వెంకట్ రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 2 డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పగడాల బాలరాజు, పరికల శ్రీనివాస్, డా.బండారి శ్రీనివాస్, తండా శ్రీనివాస్ గౌడ్, ఆకుల రాజు గౌడ్, వి. మల్లికార్జున్, బండారి మల్లేష్, రాధా కిషన్ రావు, కానుగుల గంగులు, గోవింద్ నాయక్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.