తెలంగాణ రైతుగోస పోరుదీక్ష చేపట్టిన - బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రావు

Published: Tuesday May 25, 2021
జగిత్యాల, మే 24 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు పైడిపల్లి సత్యనారాయణరావు తన నివాసంలో ఉదయం 10 గంటల నుండి ఒక గంట వరకు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఇంత వరకు కొనుగోలు చేయకపోవడం దౌర్భాగ్యం అని రైస్ మిల్లర్లు తప్ప తాలు తరుగు పేరుతో రైతులను వేధించడం సరైంది కాదని అన్నారు. అకాల వర్షం వలన తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2500 వందల కోట్లు కరోనాకు ఖర్చు పెడతానని చెప్పిన సీఎం కేసీఆర్ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. లక్ష రూపాయల రుణమాఫీ వెంటనే అమలు చేసి రైతుబంధు డబ్బులను నేరుగా రైతుల అకౌంట్లోలో జమ చేయాలని సత్యనారాయణ రావు డిమాండ్ చేశారు.