ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి-ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం శంకరపట్నం న

Published: Thursday November 24, 2022

దళితురాలైన జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయను దూషించిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల శాఖ అద్యక్షుడు గొట్టె అర్జున్ ఆధ్వర్యం లో మంగళవారం నాడు శంకరపట్నం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు సంఘం కార్యకర్తలు కౌశిక్ రెడ్డి కి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గరిగే ప్రభాకర్ మాట్లాడుతూ విజయను దూషించడం ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి తగదని అన్నారు ఆయనను అధికార పార్టీ నుండి బహిష్కరించాలని ఆయన ఆరోపించారు రోజురోజుకు దళితులపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలపై దాడులు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని, కుల మతాంతర వివాహాలు చేసుకున్న వారిపై హత్యలు జరుగుతున్నాయని  అగ్రవర్ణ దాడులు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ఉపాద్యక్షుడు బూర్ల మొగిలి మండల ప్రదాన కార్యదర్శి దేవునూరి కుమారస్వామి సంఘం నాయకులు బూర్తుల రాజు,కనకం కుమార్, సాగర్,మహేందర్,పోచయ్య తదితరులు పాల్గొన్నారు