కాంగ్రెస్ పార్టీలోపలువురు చేరిక

Published: Monday September 27, 2021
మంచిర్యాల బ్యూరో, సెప్టెంబర్26, ప్రజాపాలన : మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డు కు చెందిన టిఆర్ఎస్ పార్టీ కి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్ రావు సమక్షంలో ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ బండారి సుధాకర్ ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈసందర్భంగా టీఆరెస్ యువజన మండలం కార్యదర్శి భీమిని రాజేష్, ఏడవ వార్డు యువజన అధ్యక్షుడు ఆనందం శ్రీకాంత్, టిఆర్ఎస్వి అసెంబ్లీ నాయకుడు వెంకటేష్ లతోపాటు 40మంది టిఆర్ఎస్ నాయకులను, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నాయకులు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ పట్టణ అధ్యక్షుడు భూపతి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు పుదరి తిరుపతి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుర్మిల వేణు, యువజన జిల్లా అధ్యక్షుడు తాళ సంపత్ రెడ్డి, కౌన్సిలర్లు తెలుగు లావణ్య దేవేందర్, సంధ్యారాణి- రామ్మూర్తి యువజన కాంగ్రెస్ మండలాధ్యక్షుడు నరేష్, ఖాలీద్, మహేష్, అంజయ్య, అరుణ్, రాజన్న, పోషన్న, తదితరులు పాల్గొన్నారు.