హేమ సాయి గ్రూప్ ఆఫ్ కంపెనీ వారిచే మాటూరు హైస్కూల్ విద్యార్థులకు నోట్ బుక్స్ వితరణ

Published: Friday September 24, 2021
 మధిర, సెప్టెంబర్ 23, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలంలోని మాటురు ఉన్నత పాఠశాల విద్యార్థులకు డిస్టిక్ ఎన్ఆర్ఐ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు మరియు మాటూర్ హైస్కూల్ పూర్వ ప్రధానోపాధ్యాయులు అయినటువంటి బుసా కోటేశ్వరరావు చొరవతో శ్రీమతి వెంకట కోటమ్మ చారిటబుల్ సొసైటీ, హైదరాబాద్ వారిచే, మధిర మండల విద్యాశాఖ అధికారి శ్రీ వై ప్రభాకర్ చేతులమీదుగా విద్యార్థిని విద్యార్థులకు నోటు పుస్తకాలు అందించడం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసి కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీ దీవి సాయికృష్ణమాచార్యులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చేయూత నిస్తున్న శ్రీమతి వెంకట కోటమ్మ చారిటబుల్ సొసైటీ చైర్మన్ మేడిశెట్టి నారాయణరావు, ఆ సంస్థ సభ్యులు పి.శ్రీనివాసరావు పి.హనుమంతరావులను అభినందిస్తూ మున్ముందు కూడా వారి సేవలు కొనసాగాలని ఆకాంక్షించారు. అనంతరం దాతలను పాఠశాల ఉపాధ్యాయ బృందం, ఎంఇఒ ప్రభాకర్ చేతులమీదుగా పూల మాల మరియు దుస్సాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేడిశెట్టి లీలావతి, ఎంపీటీసీ అడపాల వెంకటేశ్వర్లు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మేడిశెట్టి రామకృష్ణ రావు, పాఠశాల ఉపాధ్యాయులు గ్రామస్తులు పాల్గొన్నారు.