పదకొండవ పిఆర్సి ప్రకారం వేతనాలు చెల్లించాలి.

Published: Wednesday July 14, 2021

మంచిర్యాల జిల్లా అధ్యక్షులు దేవన బోయిన బాపు.
మంచిర్యాల, జూలై 13, ప్రజాపాలన ప్రతినిధి : జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఎన్ హెచ్ ఎం స్కీమ్ లో పని చేస్తున్న సిబ్బందికి పదకొండవ పిఆర్సి ప్రకారం జీతాలు పెంచాలని జిల్లా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (ఐ టి యు సి) అధ్యక్షులు దేవన బోయిన బాబు డిమాండ్ చేశారు. మంగళవారం నాడు జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో నిరసన తెలిపి మెమోరాండం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నంబర్ 510 ప్రకారం జీతాలు పెరగని సిబ్బందికి న్యాయం చేయాలని కోరుతూ జిల్లా వైద్య శాఖ అధికారి కి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ టి యు సి అనుబంధ సంఘం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ రాష్ట్ర అధ్యక్షుడు రామ రాజేష్ కన్నా, అధ్యక్షుడు దాసు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.