పట్ట భద్రులు ఓటు హక్కును వినియోగించుకోవాలి

Published: Thursday February 25, 2021
మధిర ఫిబ్రవరి 24 ప్రజా పాలన ప్రతినిధిభారత రాజ్యాంగం అందించిన ఓటు హక్కు భారత ప్రజల స్వరమని 13వ వార్డ్  కాన్సిలర్ బిక్కి అనిత గారు అన్నారు. మార్చి 14న జరిగే MLC ఎన్నికల్లో పట్ట భద్రులు ఓటు హక్కును ఉపయోగించుకోవలన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు అర్జునరావు, పమ్మి రవి, CH కోటేశ్వరరావు, జి.సునీత, అపూర్వ, ఎం.ముత్తయ్య పాల్గొన్నారు. 7వ వార్డు లో విస్తృతంగా సభ్యత్వ నమోదు మధిర మున్సిపాలిటీ పరిధిలో మడుపల్లి 7వ వార్డు లో కౌన్సిలర్ మేడికొండ కళ్యాణి కిరణ్ ఆధ్వర్యంలో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం లో తెరాస నాయకులు గుండాల సరవయ్య, నండ్రు బాబు, పీట్ల పుల్లా రావు, నకులూరి సాంబశివరావు, మేడికొండ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.