రైతు సంక్షేమమే లక్ష్యంగా కృషి

Published: Tuesday February 16, 2021

కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అర్థ సుధాకర్ రెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 14 ( ప్రజాపాలన ) : రైతు సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కృషి చేస్తున్నామని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అర్థ సుధాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని సాకేత్ నగర్ లోని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కమార్ నివాసంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికారాబాద్ మండలానికి చెందిన మదన్ పల్లి గ్రామంలో సాయంత్రం 4 గంటలకు తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు భట్టి విక్రమార్క రైతు భరోసా ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. రైతులకు ఎల్లవేళలా చేదోడువాదోడుగా నిలుస్తుందని పేర్కొన్నారు. అసెంబ్లీలో భట్టి విక్రమార్క రైతుల సమస్యలను గొంతెత్తి చాటారని పేర్కొన్నారు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కాజిగిరి ఎంపి రేవంత్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా కార్యక్రమం ఈ నెల 16వ తేదీన రావిరాల దగ్గర ఏర్పాటు చేసిన ముగింపు సమావేశానికి కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నట్లు వివరించారు. మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు ప్రెస్ మీట్ ద్వారా సమాచారాన్ని చేరవేస్తున్నామని అన్నారు. రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన చట్టాలను ఉపసంహరించే వరకు అవిశ్రాంత పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని విడమర్చి వివరిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ వి.సత్యనారాయణ, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు రత్నారెడ్డి, కోటపల్లి మండల అధ్యక్షుడు వహీద్, కాంగ్రెస్ నాయకులు చాపల శ్రీనివాస్ ముదిరాజ్, రాజశేఖర్ రెడ్డి, కృష్ణారెడ్డి, కమాల్ రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.