సిపిఎం జన చైతన్య పాదయాత్ర జయప్రదం చేయండి
Published: Wednesday March 31, 2021
వలిగొండ మార్చి 30 ప్రజాపాలన ప్రతినిధి : 23న దమ్మన్నపేటలో ప్రారంభమైన సిపిఎం జనచైతన్య పాదయాత్ర ఏప్రిల్ రెండో తేదీన వలిగొండ మండలం సంఘం గ్రామంలో ప్రారంభమయ్యే పాదయాత్రను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేముల మహేందర్ పిలుపునిచ్చారు. పాదయాత్ర జయప్రదం కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం మండల కార్యదర్శి మద్దెల రాజయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలో త్రాగు ఉద్యోగ ఉపాధి కార్మిక సమస్యలు సేకరించి ప్రభుత్వంపై ఉద్యమించడానికి ప్రజల్ని చైతన్య వంతం చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. మండలంలో బునాదిగానే కాల్వ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని,ప్రభుత్వ హాస్పిటల్ 30 పడకల ఆస్పత్రి గా మార్చాలని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి మండలంలో అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ నిర్మించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి పోలే పాక యాదయ్య, యువ తెలంగాణ జిల్లా కన్వీనర్ చిలుకూరి సత్తిరెడ్డి,సిపిఐ ఎంఎల్ జిల్లా నాయకులు శీలం స్వామి,బీసీ సంఘం మండల అధ్యక్షులు సాయిని యాదగిరి, బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రాధారపు మల్లేశం, రైతు సంఘం నాయకులు సత్తిరెడ్డి, కెవిపిఎస్ నాయకులు దుబ్బ లింగం, నాయకులు యాదయ్య, ముత్యాలు, దొడ్డి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: