విత్తనాలు చల్లిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు
Published: Wednesday July 14, 2021
బోనకల్లు, జులై 13, ప్రజాపాలన ప్రతినిధి : బోనకల్లు మండలం కలకోట గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి మన్నలను పొందిన ఆదర్శ రైతు దశరథ్ గారి పంట పొలంలో వరి నాటు వేసే ప్రక్రియ కాకుండా కరివేద పద్ధతిలో వడ్లను పొలంలో చల్లిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ అత్యంత ఆధునిక పద్ధతులు అవలంబించి తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభం వచ్చే విధంగా అధునాతన వ్యవసాయం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ద్వారా మన్నలను పొందిన దశరథ గారు పొలంలో ఒడ్లు చల్లడం జరిగింది, రైతులందరూ నారు పోసి, నాటేసే పద్ధతి ద్వారా ఎక్కువ పెట్టుబడి అవుతుంది కావున, డైరెక్ట్ గా కరివేద పద్ధతిలో ఒడ్లు చల్లడం వలన తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుందని రైతులందరూ ఈ పద్ధతిని అవలంభించాలని అధికారులు కూడా రైతులకు అవగాహన కలిగించాలని రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని అలాంటి అన్నదాతలు మేలు జరిగే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు అభివృద్ధి ప్రదాత రైతు పక్షపాతి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు రైతుల కోసం ఎంతో కృషి చేస్తున్నారు అని అధికారులు, మనమందరంకూడ కృషి చేసి రైతులను అభివృద్ధి పదంలో నడిపించాలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో బోనకల్ మండలం రైతులు, మధిర నియోజకవర్గ TRS పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Share this on your social network: