మల్లన్న గుడి నిర్మాణానికి విరాళం అందించిన దాతలు
Published: Friday June 24, 2022
ఇబ్రహీంపట్నం జూన్ తేది 23ప్రజాపాలన ప్రతినిధి.ఈరోజున తుర్కయంజాల్ మున్సిపాలిటీ లోని మునగనూరు గ్రామంలోని మల్లన్న గుట్ట దగ్గర నవగ్రహాల గుడి నిర్మాణంలో భాగంగా పై కప్పు స్లాబ్ నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమం లో దాతలు మేకం లక్ష్మయ్య మరియు గుడి ధర్మకర్తలు శ్రీనివాస్ గౌడ్,వీరేశం గౌడ్ మరియు తుర్కయంజాల్ మున్సిపాలిటీ తెరాస పార్టీ అధ్యక్షుడు వేముల అమరేందర్ రెడ్డి మరియు ఇంజనీరింగ్ అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: