ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్ రె

Published: Tuesday April 04, 2023
మేడిపల్లి, ఏప్రిల్ 3 (ప్రజాపాలన ప్రతినిధి)
ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి అందేలా చూడాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు
ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్ రెడ్డి సూచించారు.చిలుకానగర్ డివిజన్  లోని నోవా బంక్వెట్ హాల్లో చిలుకా నగర్  డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ , డివిజన్ అధ్యక్షుడు పల్లే నర్సింగరావు ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా  ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వరాష్ట్రం ఏర్పడిన 8 సంవత్సరాలలో ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టనీ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి ప్రతీ కాలనీలో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటిలోను కనిపిస్తున్నాయని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అజేయ విజయాన్ని సొంతం చేసుకొని మూడోసారి సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రంలో అధికారంలోకి రావటాన్ని ఏ శక్తి ఆపలేదని స్పష్టం చేశారు. 
ఈ సందర్భంగా బిజెపి నుండి ఎమ్మెల్యే  సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన రాం రెడ్డి పలువురు చిలుకా నగర్ వాసులు.  
 ఈ కార్యక్రమంలో మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నేర్ధం భాస్కర్ గౌడ్  జనంపల్లి వెంకటేశ్వర రెడ్డి, బద్దం భాస్కర్ రెడ్డి ,గడ్డం రవికుమార్,  లేతాకుల రఘుపతి రెడ్డి, బద్దం భాస్కర్ రెడ్డి, పిట్టల నరేష్ ముదిరాజ్, ఈరెల్లి రవీందర్ రెడ్డి, కొంపల్లి రవీందర్, గుడి మధుసూదన్ రెడ్డి, జల్లి మోహన్ , ఆకిటి బాల్రెడ్డి,కొక్కొండ జగన్, చేర్యాల శ్రీను, బండి శ్రీను, రామ్ రెడ్డి, రామానుజమ్, పండ్ల కిషన్, సుధాకర్, మహేందర్, నర్సింగరావు, సాయిలు, రవీందర్ గౌడ్, కొండల్రెడ్డి, కళావతి, స్వప్న , సుభద్ర,బలరాం, ఈర్షద్ ఖాన్, అబ్బు బాయ్,కైలాస్, సకినాల ప్రసాద్, యాదగిరి, మల్లేష్,   నాయకులు, కార్యకర్తలు, మహిళలు,పార్టీ శ్రేణులు , కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు , తదితరులు పాల్గొన్నారు.