గ్రామ గ్రామాన ఘనంగా రైతు బంధు సంబరాలు

Published: Monday January 10, 2022

కోరుట్ల, జనవరి 09 (ప్రజాపాలన ప్రతినిధి): కోరుట్ల మండలంలోనీ ధర్మారం గ్రామంలో ఘనంగా రైతుబంధు సంబరాలు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ఆదేశాల మేరకు జిల్లా రైతుబంధు అధ్యక్షులు సిటీ వెంకట్రావు అధ్యక్షతన  స్థానిక సర్పంచ్ ఇప్ప మంగ రాజేందర్ రైతు బంధు సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిటీ వెంకట్రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతుల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు దీని ఫలితమే రైతు బంధు పథకం మరియు రైతు బీమా రైతులకు పనిముట్లు ఇంకా రైతుల కోసం మరెన్నో తీసుకొస్తారు రైతులను బిజెపి నాయకులు అబద్ధపు ప్రచారం తో ఆందోళనకు గురి చేస్తున్నారు వీరి ద్వంద వైఖరిని ఎండగట్టాలని ప్రతి గ్రామంలో ఉన్న రైతులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇప్ప మంగ రాజేందర్, ఎంపీటీసీ సుభాష్ రెడ్డి, ఐలాపూర్ సర్పంచ్ పిడుగు రాధా సందయ్య, మార్కెట్ కమిటీ వాయిస్ చైర్మన్ కాశి రెడ్డి మోహన్ రెడ్డి, ఐలాపూర్ ఎంపిటిసి బోడ గంగాధర్, గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దొడ్డ లింగారెడ్డి, గ్రామ శాఖ తెరాస అధ్యక్షులు దొడ్డ ముత్తిరెడ్డి, యూత్ నాయకులు కుంటాల వికాస్, ఏఈవో మమత, గ్రామ యూత్ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.